నందిగ్రామ్ లో మమతకు ఝలక్.. క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ

నందిగ్రామ్ లో జరిగిన సహకారం సంఘం ఎన్నికల్లో అధికార టీఎంసీకి భారీ ఝలక్ తగిలింది. ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. మొత్తం 12 సీట్లకు గాను.. బీజేపీ 11 సీట్లను కైవసం చేసుకుంది. జయ కేతనం ఎగురవేసింది. మరో వైపు టీఎంసీ ఈ ఎన్నికల్లో ఒక్క సీటుకు మాత్రమే పరిమితమైంది. 2021లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై గెలిచి సంచలనం సృష్టించారు. మళ్లీ ఇప్పుడు మమతకు, ఆమె సారధ్యంలోని టీఎంసీకి గట్టి షాకిచ్చారు.

Related Posts

Latest News Updates