అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ మూవీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సౌత్లో కంటే నార్త్లోనే పుష్ప మూవీకి ఓ రేంజ్లో పేరు వచ్చింది. ఈ మూవీ మొదటి భాగం దేశం వ్యాప్తంగా భారీ హిట్ కావడంతో, పార్ట్2 పుష్ప ది రూల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ మూవీ పై వస్తున్న రూమర్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. దీంతో ఆ రూమర్స్ పై తాజాగా నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ అయ్యింది. సుకుమార్ మేకింగ్, బన్నీ యాక్టింగ్, దేవి శ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్, శ్రీవల్లిగా రష్మిక మందన్న మెరుపు యాక్టింగ్, సమంత స్పెషల్ సాంగ్ ఇలా అన్నీ కలిసి రావడంతో పుష్ప ఫస్ట్ పార్ట్ భారీ హిట్ను సొంత చేసుకుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి పుష్ప పార్ట్ 2 పై పడింది. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన పుష్ప ది రైజ్ దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సెన్షేషన్ క్రియేట్ చేయడంలో, ఇప్పుడు అందిరి చూపు పుష్ప ది రూల్ పై పడింది. దీంతీ ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. దీనికి తగ్గట్టు దర్శకుడు సుకుమార్, అన్ని జాగ్రత్తలు తీసుకుని, నవంబర్లో సెట్స్ పైకి వెళ్ళేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. కొద్ది రోజులుగా పుష్ప 2కి సంబంధించిన ఒక రూమర్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతోంది. ఆ మ్యాటర్ ఏంటంటే.. పుష్ప ఫస్ట్ పార్ట్లో మలయాళం హీరో ఫాహద్ ఫాజిల్ విలన్గా నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో ఫాహద్ క్యారెక్టర్కి ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు పుష్ప సీక్వెల్లో ఫహద్ ఫాజిల్ స్థానంలో బాలీవుడ్ యంగ్ హీర్ అర్జున్ కపూర్ నటించనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఆ రూమర్స్ పై తాజాగా పుష్ప మూవీ నిర్మాతలు స్పందించారు. ఈ క్రమంలో మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేనీ మాట్లాడుతూ అది ఫేక్ న్యూస్ అని కొట్టిపడేశారు. సెకండ్ పార్ట్లో ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ చాలా కీలకమని, ఆ స్థానంలో మరొకరిని ఎందుకు తీసుకుంటామని ప్రశ్నించారని తెలుస్తోంది. పుష్పలో విలన్ క్యారెక్టర్ 100 పర్సెంట్ ఫహద్ ఫజిల్ లాంటి నటుడే న్యాయం చేయగలడని, పని లేని వాళ్ళు ఇలాంటి తప్పుడు వార్తలను క్రియేట్ చేస్తున్నారని, పుష్ప మెయిన్ విలన్ ఫహద్ ఫాజిల్ మాత్రమే అని మైత్రి నిర్మాత తేల్చి చెప్పారు. ఇక పుష్ప ఫస్ట్ పార్ట్లో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్గా కనిపించి ఫహద్ ఫజిల్ తనదైన యాక్టింగ్తో మెస్మరైజ్ చేశారు. ఫహద్ ఫజిల్ పార్ట్ 1లో స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా.. ఆ మూవీలో ఆయన నటనకి మంచి మార్కులే పడ్డాయి.. సెకండ్ పార్ట్లో షెకావత్ స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉండబోతుందని డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అలాంటప్పుడు ఓ మంచి నటుడ్ని తీసేసి, బాలీవుడ్లో ప్లాప్స్కు బ్రాండ్ అంబాసిడర్ అయిన అర్జున్ కపూర్ను ఎందుకు తీసుకుంటారు?