మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులను విడుదల చేయడంపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. హంతకులను అలా వదిలేయడం సరికాదన్నారు. రాజీవ్ గాంధీ హంతకులపై సానుభూతి అవసరం లేదని తేల్చి చెప్పారు. రాజీవ్ హంతకులను విడుదల చేయడం తనకెంతో బాధ కలిగిందన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు వేరు… రాజకీయాలు వేరన్నారు. కొందరు టెర్రరిజాన్ని పాలసీగా వుంచుకుంటారని, వారి విషయంలో అప్రమత్తంగా వుండాలని వెంకయ్య నాయుడు హెచ్చరించారు.
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసు లో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ సహా మొత్తం ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నళిని, ఆమె భర్త, శ్రీహరన్ అలియాస్ మురుగన్, సంథన్, రాబర్ట్ పాయస్, జయకుమార్లు తమిళనాడులోని ఆయా జైళ్ల ఉంచి అధికారికంగా విడుదలయ్యారు. మరో వ్యక్తి ఆర్పీ రవిచంద్రన్ కూడా త్వరలో విడుదల కానున్నారు. ఇప్పటికే పెరోల్పై ఉన్న నళిని తన తప్పనిరి హాజరు నమోదు కోసం శనివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అనంతరం వెల్లూరులోని మహిళ ప్రత్యేక జైలుకు చేరుకున్నారు. లాంఛనాలన్నీ పూర్తయ్యాక అక్కడినుంచి విడుదలయ్యారు.