టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టవచ్చని ఆదేశాలిచ్చింది. దర్యాప్తును నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు రద్దు చేసేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ వేసిన రిట్ పిటిషన్ ని తాత్కాలికంగా న్యాయస్థానం పెండింగ్ లో పెట్టింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పిటిషనర్ ను ఆదేశించింది. మరోవైపు హైకోర్టు తాజా తీర్పుతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని మరింత వేగంగా దర్యాప్తు చేసేందుకు పోలీసులకు మార్గం సుగుమమైంది. ఈ కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై లోతైన విచారణ జరగాలని హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు ఈ విచారణను ఈ నెల 18 కి వాయిదా వేసింది.