టిబెట్ మత గురువు దలైలామా గాంధీ మండేలా అవార్డును అందుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో గాంధీ మండేలా ఫౌండేషన్ ఆయనకు అవార్డు అందజేసింది. 2019 సంవత్సరానికి గాను దలైలామాకు ఈ అవార్డు వరించింది. హిమాచల్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ దలైలామాకు గాంధీ మండేలా అవార్డును అందజేశారు.












