తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ అయ్యారు. జాయినింగ్ కి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. తనకు అప్పగించిన బాధ్యతలను కచ్చితంగా స్వీకరిస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారిగా… ఏపీ సర్కార్ తనకి ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ అదేశాల ప్రకారమే తాను నడుచుకుంటానని సోమేష్ కుమార్ స్పష్టం చేయనున్నారు.
సోమేశ్ కుమార్కు ఏపీ క్యాడర్కు వెళ్లాలని ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన్ను వెంటనే రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం శాంతి కుమారిని సీఎస్ గా నియమించింది. దీంతో సోమేశ్ ఏపీ కేడర్ లో జాయిన్ అయ్యారు. ఆయన ఏపీ సర్కార్ ఏ బాధ్యతలను అప్పగిస్తుందో చూడాలి. అయితే… తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారునిగా వెళ్లనున్నారా? అంటూ ప్రశ్న అడగ్గా… నిర్ణయం తీసుకోలేదని, ప్రభుత్వం ఏ పని ఇచ్చినా.. పని చేస్తానని సోమేశ్ కుమార్ అన్నారు.