జమ్మూలో ఎదురు కాల్పులు… ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూ కశ్మీర్ లోని సిధ్రాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గరు ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కశ్మీర్ లోని సిధ్రా శివార్లలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కొని వున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్ కౌంటర్ స్థలంలో నిషేధిత లష్కరే తోయిబాకి చెందిన కోడెడ్ షీట్, లెటర్ ప్యాడ్ ను స్వాధీనం చేసుకున్నారు.

Related Posts

Latest News Updates