తిరుప్పావై –27వ పాశురము
బ్రహ్మశ్రీ కంభంపాటి నాగఫణిశర్మ గారి తెలుగు అనువాదంతో
కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా ! ఉన్దన్నై
ప్పాడిప్పఱై కొణ్డుయామ్ పెఱుశమ్మానమ్
నాడుపుగళుమ్ పరిశినాల్ నన్రాగ
చ్చూడగమే తోళ్ వళైయే,తోడే, శెవిప్పూవే,
పాడగమే,యెన్రనైయ పల్ కలనుమ్ యామణివోమ్,
ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు
మూడ నెయ్ పెయ్ దు ముళఙ్గైవళివార
క్కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్
తాత్పర్యము…
తనతో కూడని శత్రువులను జయించెడి కళ్యాణగుణసంపద గల గోవిందా! నిన్ను కీర్తించి వ్రతసాధనమగు పర యను వాద్యమును పొంది, పొందదలచిన ఘనసన్మానము లోకులందరు పొగడెడి తీరులో నుండును. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు, బాహువులకు దండకడియములు, చెవిక్రిందభాగమున దాల్చెడి దుద్దు, పైభాగమున పెట్టుకొనెడి కర్ణపూవులు, కాలియందెలు మొదలగు అనేకాభరణములను మేము దాల్పవలయును. తరువాత మంచి చీరలను దాల్పవలయును. దానితరువాత పాలు, అన్నము మునుగుట్లు నేయిపోసి ఆ మధురపదార్థము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చొని చల్లగా, హాయిగా భుజింపవలెను. అని గోపికలు తమ వ్రతఫలమును ఇందు విన్నవించిరి.












