ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని సేక్రెడ్ హార్ట్ కేథడ్రల్ చర్చిని సందర్శించారు. ఈ సందర్భంగా చర్చి సంబంధీకులు ప్రధాని మోదీని ఘనంగా ఆహ్వానించారు. ఈస్టర్ సందర్భంగా చర్చిలో మోదీ కొవ్వొత్తిని వెలగించి, క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక… చర్చిలో పిల్లలు పాడిన ప్రార్థనా గీతాలను మోదీని ఆసక్తిగా విన్నారు. ఇది పూర్తైన తర్వాత క్రైస్తవ ప్రతినిధులతో కలిసి, ప్రధాని మోదీ చర్చి ఆవరణలో కొబ్బరి మొక్కను నాటారు. చివరగా… క్రైస్తవ ప్రతినిధులు, సాధారణ ప్రజానీకం ప్రధాని మోదీతో చర్చి ముందు ఓ గ్రూప్ ఫొటో దిగారు.