మరి కొన్ని గంటల్లో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కి చేరుకోనున్నారు. ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్తారు. అంతర్జాతీయ విమానాశ్రయం తరహా సౌకర్యాలతో స్టేషన్ ను డెవలప్ చేయాలని కేంద్రం భావించింది. ఈ కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇప్పటి నుంచి 3 సంవత్సరాల లోపే పూర్తి చేసేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ పర్యటనలో హైదరాబాద్-మహబూబ్నగర్ రైల్వే డబ్లింగ్ పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ను మోదీ ప్రారంభించనున్నారు. అలాగే ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్లో భాగంగా 13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్కు మోదీ చేరుకోనున్నారు. అక్కడ నుంచే ఐదు జాతీయ రహదారుల పనులు ప్రారంభంతో పాటు బీబీ నగర్ ఎయిమ్స్కు సంబంధించి కొత్త బిల్డింగ్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.
శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పరేడ్ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మోదీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారని బీజేపీ నేతలు వెల్లడించారు. అయితే తొలుత మోదీ బేగంపేట ఎయిర్పోర్టుకు ఉదయం 9.30 గంటలకు వచ్చేలా షెడ్యూల్ ఖరారు చేరారు. ఆ తర్వాత 10.30కు మార్చారు. ప్రధాని మోదీ పర్యటనకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సీఎస్ శాంతికుమారి మంగళవారం మోదీ పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. మోదీ పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన.. షెడ్యూల్ ఇదే!
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. 2 గంటల పాటు మోదీ హైదరాబాద్ లోనే వుండనున్నారు. శనివారం ఉదయం 11:30 నిమిషాలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు మోడీ. అక్కడి నుండి 11:45 కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకొని..11:45 – 12 గంటల వ్యవధిలో వందే భారత్ ట్రైన్ ప్రారంభిస్తారు. 12:05 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి పెరేడ్ గ్రౌండ్ కు వెళ్తారు మోడీ. 12:15 నిమిషాలకు కు పెరేడ్ గ్రౌండ్ కు చేరుకొని.. 1: 20 నిమిషాల వరకు పెరేడ్ గ్రౌండ్లో లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుండి 1:35 నిమిషాలకు బేగంపేట్ విమానాశ్రయం కు చేరుకొని విమానంలో చెన్నై వెళ్లనున్నారు.