పరాక్రమ దివస్, నేజాతీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నేతాజీకి ట్విట్టర్ వేదికగా ఘనంగా నివాళులు అర్పించారు. వలస పాలనను తీవ్రంగా ప్రతిఘటిస్తూ… ఉద్యమాలు చేసిన నేతాజీ ఎప్పటికీ గుర్తుండిపోతారని మోదీ కొనియాడారు. నేతాజీ ఆలోచనలకు తాము తీవ్రంగా ప్రభావితం అయ్యామని, ఆయన కలలను సాకారం చేయడానికి తాము కృషి చేస్తున్నామని వివరించారు. భారతదేశ చరిత్రకు నేతాజీ చేసిన అసమానమైన కృషిని ప్రధాని మోదీ కొనియాడారు.
Today, on Parakram Diwas, I pay homage to Netaji Subhas Chandra Bose and recall his unparalleled contribution to India’s history. He will be remembered for his fierce resistance to colonial rule. Deeply influenced by his thoughts, we are working to realise his vision for India.
— Narendra Modi (@narendramodi) January 23, 2023
ఇక.. రాష్ట్రపతి ముర్ము కూడా నేతాజీకి నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. పరాక్రమ దివస్, నేతాజీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్లు ముర్ము పేర్కొన్నారు. ఎనలేని ధైర్యానికి, దేశభక్తికి నేతాజీ ప్రతీక అని కొనియాడారు. నేతాజీ పిలుపు, ఆలోచనలతో లక్షలాది మంది దేశప్రజలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని, దేశ స్వాతంత్రం పోరాడారని ముర్ము పేర్కొన్నారు. ఆయనకు దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని పేర్కొన్నారు.
स्वतंत्रता सेनानी वीर सुरेन्द्र साए की जन्म जयंती पर उनको सादर नमन। उनका संघर्षपूर्ण जीवन-वृत्त साहस, त्याग और बलिदान का अद्भुत उदाहरण है। मैं अनुरोध करती हूं कि सभी देशवासी वीर सुरेन्द्र साए जैसे राष्ट्र नायकों के बारे में जानें और उनकी जीवन-गाथा से प्रेरणा लें।
— President of India (@rashtrapatibhvn) January 23, 2023












