ఆ ముగ్గుర్నీ సెంటిమెంట్‌గా భావిస్తున్న నాగ్ అశ్విన్

నాగ్ అశ్విన్ సినిమా అంటే అందులో క‌చ్ఛితంగా గెస్ట్ రోల్స్ ఉంటాయ‌ని ఆడియ‌న్స్ ఫిక్స్ అవుతున్నారు. గెస్ట్ రోల్స్ తో పాటూ త‌న గ‌త సినిమాల్లోని న‌టుల్ని రిపీట్ చేయ‌డం ఆయ‌న‌కు అలవాటైపోయింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ఎవడే సుబ్ర‌హ్మ‌ణ్యం, మ‌హానటి సినిమాలు వ‌చ్చాయి. వీట‌న్నింటిలోనూ ఆడియ‌న్స్ ను స‌ర్‌ప్రైజ్ చేసే క్యామియోలు ఎన్నో ఉన్నాయి. https://cinemaabazar.com/

ఇప్పుడు నాగ్ అశ్విన్ తాజా సినిమా క‌ల్కి లో కూడా ఆడియ‌న్స్ ను గెస్ట్ రోల్స్ అబ్బుర‌ప‌రుస్తున్నాయి. భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆడియ‌న్స్ కు స‌రికొత్త విజువ‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్ ను అందిస్తోంది. హాలీవుడ్ సినిమాకు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉండేలా నాగ్ అశ్విన్ క‌ల్కిని తీర్చిదిద్దాడ‌ని ఆడియ‌న్స్ అత‌న్ని ప్ర‌శంసిస్తున్నారు. https://cinemaabazar.com/

ఇదిలా ఉంటే క‌ల్కిలో ఎంద‌రో న‌టులు క్యామియోలు చేశారు. ఇక అస‌లు విషయానికొస్తే నాగ్ అశ్విన్ ఫిల్మోగ్ర‌ఫీని ప‌రిశీలిస్తే ఆయ‌న తీసిన మూడు సినిమాల్లో ముగ్గురు న‌టీన‌టులు భాగ‌మ‌య్యారు. వారే అవ‌స‌రాల శ్రీనివాస్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మాళ‌వికా నాయ‌ర్. నాగ్ అశ్విన్ తీసిన మూడు సినిమాల్లో వీరు భాగ‌మ‌య్యారు. మ‌రి ఈ ముగ్గురిని నాగ్ అశ్విన్ సెంటిమెంట్ గా భావించి త‌న సినిమాల్లో రిపీట్ చేస్తున్నాడా లేక వారితో ఉన్న బాండింగ్ వ‌ల్ల ఈ క్యామియోలు చేయిస్తున్నాడో ఆయ‌న‌కే తెలియాలి.  https://cinemaabazar.com/

Related Posts

Latest News Updates