తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చిన ముగ్గురు నిందితులకు హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. రామచంద్రభారతి (సతీశ్శర్మ), నందుకుమార్, సింహయాజి అనే నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. దిల్ సుఖ్ నగర్ లోని మెజిస్ట్రేట్ నివాసంలో పోలీసులు నిందితులను హాజరు పరిచగా ఈ మేరకు వారికి నవంబర్ 11వ తేదీ దాకి రిమాండ్ విధించారు. నిందితులను రిమాండ్కు తరలించే క్రమంలో పోలీసులు వారికి చేవెళ్ల ఏరియా దవాఖానలో వైద్య పరీక్షలు జరిపారు. ఆ తరువాత రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ను చంచల్గూడ జైలుకు తరలించారు.