దిల్ రాజుపై మండి పడుతున్న మెగా, నందమూరి అభిమానులు!

ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై మెగా, నందమూరి అభిమానులు మండిపడుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నుండి ఒకేసారి మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’ , బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ రెండు చిత్రాలు ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద పోటీపడుతున్న విషయం తెలిసిందే.ఇది కాకుండా మూడో చిత్రం తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘వారిసు’ కూడా తెలుగులో ‘వారసుడు’గా వస్తోంది. దిల్ రాజు సొంత చిత్రం గా ఈ డబ్బింగ్ సినిమా కోసం ఎక్కువ థియేటర్లు ఆక్రమించేస్తున్నారన్నది ఆరోపణ. ఒక డబ్బింగ్ సినిమా కోసం తెలుగులో స్టార్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు అడ్డుపడతావా అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. దీనిపై చిరు, బాలయ్య కలుగజేసుకోవాలని.. దిల్ రాజుపై యాక్షన్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలయికలో బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇదే సంస్థ నుంచి వస్తోన్న మరో చిత్రం ‘వీరసింహా రెడ్డి’. నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద పోటీ పడుతున్నాయి. చాలా కాలం తరవాత సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య నిలవడంతో అందరి దృష్టి ఈ సినిమాలపై పడింది. బాక్సాఫీసు వద్ద ఈ బడా హీరోల ఫైట్ ఎలా ఉండబోతోందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ రెండు సినిమాల మధ్యలోకి ‘వారసుడు’ వచ్చాడు. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోంది ఈ చిత్రం. దిల్ రాజు నిర్మాత. నిజానికి ఇది తమిళ సినిమా. ‘వారిసు’ పేరుతో తమిళంలో రూపొందుతోన్న ఈ సినిమాను ‘వారసుడు’గా తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. వాస్తవానికి ఒక తమిళ హీరోతో తెలుగు వాళ్లు చేస్తున్న బిగ్ మూవీ ఇది. సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమా కోసం ఆంధ్ర, నైజాంలో దిల్ రాజు ఎక్కువ థియేటర్లు లాగేసుకుంటున్నారు అనేది ప్రస్తుత ఆరోపణ. ‘వారసుడు’ సినిమా కోసం ఆంధ్ర, నైజాంలో ఎక్కువ థియేటర్లను దిల్ రాజు తీసుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో దిల్ రాజుపై చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు పండిపడుతున్నారు. ఒక తమిళ హీరో కోసం తెలుగులో స్టార్ హీరోలు అయిన చిరు, బాలయ్య సినిమాలకు గండిగొడతావా అంటూ దిల్ రాజుపై విరుచుకుపడుతున్నారు. ‘వారసుడు’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో చేసిన మార్కెట్ రూ.9 కోట్లని.. దాని కోసం రూ.60 నుంచి రూ.70 కోట్లు బిజినెస్ చేసే సినిమాలకు అడ్డుపడతారా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. దీనిపై చిరంజీవి, బాలకృష్ణ స్పందించాలని.. అభిమాన హీరోలు ఇద్దరు దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు మెగా స్టార్ చిరంజీవితో, నందమూరి బాలకృష్ణ తో దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా కూడా చేయకపోవడానికి గల కారణం ఏమిటో చెప్మా?

Related Posts

Latest News Updates