తమిళనాడు శివకాశి భద్రకాళి ఆలయ గోపురంలో అగ్ని ప్రమాదం

తమిళనాడులోని విరుదునగర్ శివకాశి భద్రకాళి ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. అయితే… ఇందులో ప్రాణనష్టం ఏమాత్రం జరగలేదు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన రంగప్రవేశం చేసి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఆలయ గోపుర పునరుద్ధరణ పనులు జరుగుతుండగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ప్రమాదాన్ని వెంటనే గమనించిన తమిళనాడు ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది 45 నిమిషాల్లో మంటలను అదుపు చేశారు. అయితే… ఆలయం బయట బాణాసంచా పేలుడుతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Latest News Updates