సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ నూతన దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ (31) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జోసెఫ్.. కేరళ అలువాలోని రాజగిరి ఆస్పత్రిలో హెపటైటిస్ కు చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఆదివారమే ఆయన అంత్యక్రియలు జరిగిపోయాయి. ఇక.. జోసెఫ్ మను ఐయామ్ క్యూరియస్ సినిమాతో బాలనటుడిగా పరిచయం అయ్యారు.
ఈ మూవీ 2004 లో విడుదలైంది. కొన్నేళ్ల తర్వాత జోసెఫ్ సినీ పరిశ్రమ మీద వున్న ఆసక్తితో పలు మలయాళ, కన్నడ, హిందీ చిత్రాలకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. నాన్సీ రాణి సినిమాతో పూర్తి స్థాయి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే… తాను స్వయంగా తెరకెక్కించిన సినిమా రిలీజ్ చూడకముందే జోసెఫ్ మరణించడం గమనార్హం. జేమ్స్ మృతిపై అహానా కృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు పెట్టారు.












