ప్రధాని నరేంద్ర మోదీతో బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దంపతులు భేటీఅయ్యారు. తమ రెండో కుమారుడి వివాహానికి రావాలంటూ కొండా దంపతులు మోదీని ఆహ్వానించారు. అందుకే ఢిల్లీకి వచ్చి కలిశామని దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో విద్య, వైద్యం గురించి మాట్లాడుకున్నామని కొండా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇక… తాము చేపట్టిన స్వచ్ఛ ట్రక్, బయోగ్యాస్ ప్రాజెక్టుల గురించి మోదీకి వివరించారు.