ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు అమృత్పాల్ సింగ్ కీలక అనుచరుడు పప్పాల్ప్రీత్ సింగ్ ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ లోని హోషియార్ పూర్ లో అరెస్టయ్యాడు. పంజాబ్ పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కలిసి పల్ ప్రీత్ సింగ్ కోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. చివరికి ఈ ఆపరేషన్ లో విజయం సాధించారు. గత నెలలో జలంధర్ నుంచి పరారీ అయిన విషయం తెలిసిందే. అమృత్పాల్తో పాటు పప్పాల్ప్రీత్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. గత నెలలో జలంధర్లో అమృత్పాల్ సింగ్, పప్పల్ప్రీత్ సింగ్లు పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నారు. అప్పటి నుండి పప్పల్ప్రీత్ సింగ్ అతనితోపాటే ఉన్నాడు. హోషియాపూర్ చేరుకున్న అనంతరం వారు తప్పించుకునేందుకు వివిధ మార్గాల్లో వెళ్లడం సిసిటివి కెమెరాలో కూడా రికార్డయింది.
భైసాఖి ఉత్సవాల సందర్భంగా పంజాబ్లోని భటిండాలో భద్రత కట్టుదిట్టం చేశారు. భైసాఖి సమ్మేళనంలో సిక్కులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఖలిస్థాన్ మద్దతుదారుడు అమృత్పాల్ సింగ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పంజాబ్ పోలీసులు భద్రతను పెంచారు. సిక్కులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించేందుకు భైసాఖి ఉత్సవాల్లో పెద్దఎత్తున సిక్కులు సమావేశం కావాలని అనుచరులకు పిలుపునిస్తూ అమృత్పాల్ ఓ వీడియో విడుదల చేశారు.