కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ఖమ్మం వేదికగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం, కేరళ సీఎం, పంజాబ్ సీఎం, యూపీ మాజీ సీఎం అఖిలేశ్, వామపక్ష నేతలు దీనిని ప్రారంభించారు. కలెక్టరేట్‌లో మొదట నేతలు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రెండో విడత కంటి వెలుగుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కంటి వెలుగు లబ్ధిదారులకు అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం గురించి జాతీయ నేతలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు. రాష్ట్రంలో అంధత్వ వ్యాధులను పూర్తి స్థాయిలో నిర్మూలించడంతో పాటు కళ్లల్లో కాంతులు నింపాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.