ఇప్పటం గ్రామ బాధితులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో బాధితుడికి లక్ష చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో ప్రభుత్వ దాష్టీకానికి ఇళ్లు దెబ్బతిన్నాయని, ప్రజలు ఆవాసాలు కోల్పోయారన్నారు. వారందరికీ అండగా వుండాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారని ప్రకటించారు. ఈ ఘటన ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైందన్నారు. ఇళ్లు దెబ్బతిన్నా… ఇప్పటం గ్రామస్థులు ధైర్యం కోల్పోలేదన్నారు. వారి గుండె నిబ్బరాన్ని చూసి పవన్ చలించిపోయారని, వారికి అండగా వుండాలని నిర్ణయించుకున్నారని మనోహర్ ప్రకటించారు.
ఇప్పటంలో ఇళ్ళు కూల్చివేతకు గురైన వారికి లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించిన శ్రీ @PawanKalyan గారు – JanaSena Party PAC Chairman Shri @mnadendla pic.twitter.com/yrAFw93Sfz
— JanaSena Party (@JanaSenaParty) November 8, 2022












