ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇండియన్‌ లైబ్రరీ కాంగ్రెస్‌ లో పాల్గొనాలని ఆహ్వానం అందింది. ఇండియన్‌ లైబ్రరీ కాంగ్రెస్‌ సమావేశాలను జనవరి 1న కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రారంభిస్తారు.   ఆహ్వానం మేరకు జనవరి 2, 3 తేదీల్లో కేరళ రాష్ట్రం లో కవిత పర్యటించనున్నారు. కేరళలోని కన్నూరులో జరగనున్న ఇండియన్‌ లైబ్రరీ కాంగ్రెస్‌లో ఆమె పాల్గొననున్నారు. జనవరి 2వ తేదీ సాయంత్రం జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు కవిత ముఖ్య అతిథిగా హాజరువుతారు.  3వ తేదీని సంస్కృతిపై జరిగే చర్చలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, బీహార్‌తోపాటు వివిధ రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.