హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెకి దిగారు. తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ.. సమ్మె చేస్తున్నారు. సమ్మె కారణంగా సగం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరయ్యారు. సమ్మె ఎఫెక్ట్ మెట్రోపై స్పష్టంగా పడింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగులు విధుల బహిష్కరణ చేశారు. దీంతో సమ్మె ఎఫెక్ట్ మెట్రోపై పడింది. 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని ఆందోళనకు దిగారు. తమకు 5 ఏళ్లుగా 11 వేల రూపాయల జీతం మాత్రమే కంపెనీ ఇస్తోందని.. 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకూ జీతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సమ్మెతో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకూ మెట్రో స్టేషన్లలో టిక్కెట్ వ్యవస్థ స్తంభించిపోయింది. అమీర్ పేట, మియాపూర్ మెట్రో స్టేషన్లలో టిక్కెట్ల కోసం ప్రయాణికులు భారీగా క్యూ కట్టారు.