ఉన్నచోటే ఓటు వేయండి… ”రిమోట్ ఓటింగ్” ను తేనున్న ఎన్నికల సంఘం

సొంతూళ్లకు వెళ్లకుండానే ఓటు హక్కు వినియోగించుకునేలా రిమోట్‌ ఓటింగ్‌ను తీసుకొచ్చేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఈ రిమోట్‌ ఓటింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ EC ఓ కాన్సెప్ట్‌ నోట్‌ను సిద్ధం చేసింది. దీంతో పాటు ఓ రిమోట్‌ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ నమూనాను రూపొందించింది. ఒకే పోలింగ్‌ బూత్‌ నుంచి 72 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఈ రిమోట్‌ ఈవీఎంను అభివృద్ధి చేశారు. జనవరి 16న ఈ నమూనా మిషన్‌ ప్రదర్శన కోసం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు ఈసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. రిమోట్‌ ఓటింగ్‌ ను అమల్లోకి తెచ్చేముందు.. ఆచరణలో ఎదురయ్యే న్యాయపరమైన, సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఈసీ వివరించింది. ఇందుకోసం రాజకీయ పార్టీల అభిప్రాయాల కోరనున్నట్లు పేర్కొంది.

 

ఎన్నికల సమయంలో సొంతూళ్లో లేనివారు., ఇతర ఊళ్లకు వలస వెళ్లిన వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. అంతేకాకుండా ఆసక్తి లేకపోవడం, ప్రయాణ ఖర్చుల నేపథ్యంలో వెనకాడటం, వ్యక్తిగత ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు… ఇలా సవాలక్ష కారణాలతో ప్రజలు ఓటింగ్ కి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ ఓటింగ్ లో పాల్గొనే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ కొత్త కాన్సెప్ట్ ను అందుబాటులోకి తెచ్చింది. ప్రజాస్వామ్య పండగలో అందరూ పాలుపంచుకోవాలన్న ఉద్దేశంతోనే రిమోట్ ఓటింగ్ మిషన్ ను తీసుకొచ్చామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

 

Related Posts

Latest News Updates