ఉక్రెయిన్ కి మానవ సాయం చేసేందుకు సిద్ధమైన భారత ప్రభుత్వం

ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ లేఖ రాశారు. కొన్ని రోజులుగా రష్యాతో యుద్ధంలో తలపడుతున్నామని, ఈ నేపథ్యంలో తమకు మానవతా సాయం కావాలని జెలెన్ స్కీ ఆ లేఖలో అభ్యర్ధించారు. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జెలెన్ స్కీ లేఖను భారత విదేశాంగ అధికారులకు జపరోవా అందజేశారు.

అయితే… ఉక్రెయిన్ కి మానవతా సాయం అందించేందుకు సిద్ధమని భారత విదేశాంగ శాఖా సహాయ మంత్రి మీనాక్షి లేఖి ప్రకటించారు. ఉక్రెయిన్ కి వైద్య సామాగ్రి వంటి అదనపు సాయం అందిస్తామన్నారు. తమ దేశంలో మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడం భారతీయ కంపెనీలకు కూడా అవకాశంగా వుంటుందన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన కూడా తొలిగిపోయే అవకాశాలున్నాయని జెలెన్ స్కీ తన లేఖలో పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates