ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో పాటు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రారంభించారు. యాదాద్రి నుంచి వీరు నేరుగా ఖమ్మం చేరుకున్నారు. ఖమ్మం చేరుకున్న జాతీయ నేతలకు ఖమ్మం జిల్లా నేతలు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ నేత డీ రాజా ప్రారంభోత్సవం చేశారు.

అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ గురించి సీఎం కేసీఆర్ ఢిల్లీ, కేరళ, పంజాబ్ సీఎంలకు వివరించారు. ఇక.. కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ను కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను జాతీయ నేతలు తిలకించారు. సీఎం కేసీఆర్‌ కలెక్టరేట్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలు నేతలకు వివరించారు.