శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఈనేపథ్యంలో శనివారం నామినేమిన్ వేయాల్సిందిగా బండా ప్రకాష్కు ముఖ్యమంత్రి సూచించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ తెలిపారు. వాళ ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ చైర్మన్ను సభ్యులు ఎన్నుకోనున్నారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమే అవుతుందని చెబుతున్నారు. మండలి డిప్యూటీ ఛైర్మన్ గా నేతి విద్యాసాగర్ రావు పదవి కాలం పూర్తయినప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. బండ ప్రకాశ్ 2021 లో ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎంపికయ్యారు.
మండలి డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పదవీకాలం 2021, జూన్ 3న పూర్తయింది. దీంతో అప్పటినుంచి డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉన్నది. ఈనేపథ్యంలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడింది. నేడు నామినేషన్లను స్వీకరించనున్నారు. 12న ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభమైన అనంతరం డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను పూర్తిచేసి బాధ్యతలు అప్పగించనున్నారు.







