గుజరాత్ అసెంబ్లి ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, సిఎం భూపేంద్ర పటేల్, రాష్ట్ర బిజెపి చీఫ్ సిఆర్ పాటిల్ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. వచ్చే ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించడం, విద్యార్థినులందరికీ ఉచిత విద్య, రాడికలైజేషన్ వ్యతిరేక సెల్ ఏర్పాటు చేయడం వంటి హామీలను ప్రజల ముందుంచింది. జెపి నడ్డా మాట్లాడుతూ ఎన్నికల్లో మరోసారి బీజేపీ విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఉగ్రవాద సంస్థలు, భారత వ్యతిరేక శక్తుల స్లీపర్ సెల్లు, సంభావ్య బెదిరింపులను గుర్తించి, నిర్మూలించడానికి యాంటీ రాడికలైజేషన్ సెల్ను రూపొందిస్తామని చెప్పారు. గుజరాత్ యూనిఫాం సివిల్ కోడ్ కమిటీ సిఫార్సును పూర్తిగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ ఈరోజు మా సంకల్ప్ పత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉంది. రెండు దశాబ్దాలుగా బిజెపి ప్రజల ప్రేమను పొందింది. ఇది కేవలం బూటకపు వాగ్దానాలే కాదు, ప్రధాని మోడీ రూపొందించిన అభివృద్ధి రోడ్ మ్యాప్కు మా నిబద్ధత. మేము దేనికి మాత్రమే కట్టుబడి ఉన్నాము. హామీలన్నీ నెరవేర్చి చూపిస్తాం అని అన్నారు.












