గుజరాత్కు చెందిన అమూల్ సంస్థ కర్ణాటకలోకి ప్రవేశించడానికి ప్రణాళికలు రూపొందించింది. వ్యాపార విస్తరణలో భాగంగా బెంగళూరులో తమ పాల ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభిస్తామని అమూల్ ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో అమూల్ చేసిన ఈ ప్రకటన రాజకీయ ప్రకంపణలు సృష్టిస్తున్నది. అధికార బీజేపీ రాష్ట్రానికి చెందిన నందిని సంస్థను అమూల్లో కలిపేందుకు సిద్ధమైందని ప్రతిపక్షాలు విమర్షణాస్త్రాలు ఎక్కుపెట్టాయి. అసలే పికల్లోతు అవినీతిలో కూరుకుపోయిన అధికార బీజేపీకి తాజా వివాదంతో కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. దీంతో కక్కలేక, మింగలేక అన్నట్లు ఆ పార్టీ పరిస్థితి తయారైంది. అయితే కర్ణాటక పాడి ఉత్పత్తిదార్ల సహకార సంఘాల సమాఖ్య కు చెందిన నందిని బ్రాండ్ పాలకు బెంగళూరు హోటళ్ల యమానుల సంఘం పూర్తి మద్ధతు ప్రకటించింది. ఇకపై మహానగరంలోని తమ హోటళ్లలో నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తామని ప్రకటించింది. కేఎంఎఫ్ను, రాష్ట్రంలోని పాల రైతులను ఆదుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని బృహత్ బెంగళూరు హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు పీసీ రావ్ చెప్పారు. ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసిన పాలను, నందిని పాలను ఉపయోగించాం. అయితే ఇకపై మంచి కాఫీ, స్నాక్స్ తయారు చేసేందుకు నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తామని వెల్లడించారు. దీంతో బెంగళూరులో తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్న అమూల్కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
