తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే బీ భూపతిరావు మృతికి సంతాపంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. రెండు నిమిషాలపాటు సభ సంతాపం తెలిపింది. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతోపాటు మున్సిపల్శాఖ చట్ట సవరణ, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లులను మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సవరణకు సంబంధించిన బిల్లును మంత్రి హరీశ్రావు, అటవీ యూనివర్సిటీ బిల్లును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ మోటర్ వెహికిల్స్ టాక్సేషన్ సవరణ బిల్లులును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రవేశపెట్టారు.