టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి అరెస్ట్ పై ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ స్పందించారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడితో పాటు ఆయన కుమారులు విజయ్, రాజేష్పై ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. రెండు సెంట్ల భూమిని అయ్యన్న ఆక్రమించారని వెల్లడించారు. ఆ భూమిపై నకిలీ ఎన్ఓసీని తీసుకొచ్చారన్నారు. ఎన్ఓసీపై వున్న సంతకం ఏఈది కాదన్నారు. దీంతో అయ్యన్న, విజయ్, రాజేష్పై కేసు నమోదు చేశామని ఏపీ సీఐడీ డీఐజీ వెల్లడించారు. ఐపీసీ 464, 467, 471, 474, రెడ్విత్ 120బి, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.ఏ1,ఏ3 ని చట్ట ప్రకారమే అరెస్ట్ చేశామన్నారు. కుట్ర చేసి భూమి ఆక్రమించారన్న ఆరోపణలు వున్నాయని, విచారణలో అన్ని విషయాలు బయటికి వస్తాయని డీఐజీ తెలిపారు.
