తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలు తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా బెయిల్ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే నిందితుల బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అదేవిధంగా నిందితుల రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. నిందితులు బెయిల్ పిటిషన్ ను రేపు హైకోర్టు విచారించనుంది.