టాలీవుడ్ నటుడు అల్లు రమేశ్ కన్నుమూశారు. హార్ట్ ఫెయిల్ కారణంగా మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రంగస్థల నటులు సంతాపం ప్రకటించారు. అల్లు రమేశ్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు. విశాఖపట్నం ఈయన స్వస్థలం. నాటక రంగం తర్వాత టాలీవుడ్ కి వచ్చాడు. ఆయన నటించిన తొలి సినిమా సిరిజల్లు. ఈ సినిమాలో నలుగురు హీరోల్లో ఈయనా ఒకరు. అయితే.. నెపోలియన్ సినిమా ఈయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. తోలుబొమ్మలాట, మధుర వైన్స్, రావణ దేశం లాంటి సినిమాలతో మరింత పేరు తెచ్చుకున్నాడు.













