తెలంగాణ  రాష్ట్ర మంత్రిమండలి 2023-24 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్అధ్యక్షతన ప్రగతిభవన్లో కేబినెట్భేటీ జరిగింది. సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు. దీంతో ఆర్థిక మంత్రి హరీశ్రావు నెల 6 అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ప్రవేశపెట్టిన మరుసటి రోజు అంటే నెల 7 అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. నెల 8 బడ్జెట్పై సాధారణ చర్చ జరగనుంది. అదే రోజు ఆర్థిక మంత్రి హరీశ్రావు సమాధానం చెప్పనున్నారు. 9, 10, 11 తేదీల్లో పద్దుల పైన చర్చ జరగనుంది. ఈనెల 12 సభలో ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టనుంది. అదే రోజు చర్చించి, బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. దీంతో అసెంబ్లీ బడ్జెట్సమావేశాలు ముగియనున్నాయి.