13 ఏళ్ల కుర్రాడి సంచలనం

ఇంటర్‌ స్కూల్‌ టోర్నీలో 500కు పైగా రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు 13 ఏళ్ల కుర్రాడు.  లిమిటెడ్‌ ఓవర్లలో విధ్వంసం సృష్టిస్తూ రికార్డు సాధించాడు. నాగ్‌పూర్‌కు చెందిన 13 ఏళ్ల యశ్‌ చావ్డే ఇంటర్‌ స్కూల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో చెలరేగిపోయాడు. బౌండరీలు , సిక్సర్లతో ప్రత్యర్థి జట్టును మట్టికరిపించాడు. 178 బంతుల్లోనే 508 పరుగులు అందుకున్నాడు.  ఇన్నింగ్స్‌లో 81 ఫోర్లు, 18 సిక్సులు ఉన్నాయి.   నాటౌట్‌గా కూడా నిలిచాడు. రోజుల తరబడి సాగే టెస్ట్‌ మ్యాచ్‌ల్లో ఇటువంటి రికార్డు సాధిస్తే ఆశ్యర్యపోనక్కర్లేదు. కేవలం 40 ఓవర్లలోనే ఈ రికార్డును కైవసం చేసుకున్నాడు.   భారత్‌లో ఇంటర్‌ స్కూల్‌ క్రికెట్‌ టోర్నీల్లో ఇదే వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. అండర్‌ 14 క్రికెట్‌ టోర్నీలో ఈ అరుదైన స్కోరు నమోదు చేశాడు.

Related Posts

Latest News Updates