మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ మరణించగా మరొకరు తీవ్రంగా గాపడ్డారు. శుక్రవారం ఉదయం ప్రైవేటు శిక్షణ విమానం.. రేవా జిల్లాలోని ఉమ్రి గ్రామంలో ఉన్న ఓ ఆలయ శిఖరానికి ఢీకొట్టి కుప్పకూలింది. దీంతో విమానం నడుపుతున్న పైలట్ అక్కడికక్కడే మృతిచెందగా, ట్రైనర్ తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విమాన శకలాల నుంచి వారిని వెలికితీశారు.












