కాంతారా నటుడు కిశోర్ కుమార్ ట్విట్టర్ అకౌంట్ నిలిపివేత

కాంతార మూవీ నటుడు జి.కిశోర్ కుమార్ కి ట్విట్టర్ ఝలక్ ఇచ్చింది. ఆయన ట్విట్టర్ అకౌంట్ ను తాత్కాలికంగా నిలిపేసింది. వివాదాస్పద పోస్టులతో ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంగా ఆయన ఖాతాను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. జి.కిశోర్ కుమార్ ఇటీవల ఇన్ స్టాలో ఒక పోస్ట్ చేస్తూ.. ‘‘డిసెంబరు 30వ తేదీ పత్రికా స్వేచ్ఛకు, భారత ప్రజాస్వామ్యానికి చీకటి దినం లాంటిది. ఎందుకంటే ఆ రోజున ఎన్డీటీవీపై వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ పూర్తి పట్టును సాధించింది’’అని కామెంట్ చేశారు. అంతేకాకుండా మూఢ నమ్మకాలపై కూడా ట్వీట్ చేసింది. అయితే.. దీనిని ఎప్పుడు నిలిపేశారో మాత్రం తెలియడం లేదు. కాంతారా మూవీలో అటవీ అధికారి పాత్రను జి.కిశోర్ కుమార్ పోషించారు. జి.కిశోర్ కుమార్ ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ఆయనకు ఇన్ స్టాలో 43వేల మందికిపైగా ఫాలోవర్స్ , ఫేస్ బుక్ లో 66వేల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు.

 

Related Posts

Latest News Updates