పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో కొత్త ప్రొడక్షన్ హౌజ్ ను ప్రకటించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ (డీఆర్ పీ) అని ప్రకటించారు. ఈ కొత్త ప్రొడక్షన్ హౌజ్ కిందే కొత్త సినిమాలు తీస్తున్నట్లు ప్రకటించారు. మొట్ట మొదటి సినిమా బలగం అన్న సినిమా వస్తోందని ప్రకటించారు.

తన కూతురు హన్షిత రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుందని ప్రకటించాడు. ఇంతకు ముందు ఏటీఎం అనే వెబ్ సిరీస్ ఇదే బ్యానర్ కింద తీశామని, ఇప్పుడు బలగం సినిమా వస్తోందన్నారు. చిన్న చిన్న సినిమాలను ఎంకరేజ్ చేసేందుకే ఈ బ్యానర్ ను ప్రారంభించామని చెప్పుకొచ్చారు.













