జీ-20 అధ్యక్ష బాధ్యతలు …భారత్ చేపట్టడం గర్వకారణం

జీ20 అధ్యక్ష బాధ్యతలు భారత్ చేపట్టడం గర్వకారణమని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మోదీ  మాట్లాడారు. త్వరలో మన్కీ బాత్ 100వ ఎపిసోడ్ రాబోతుందన్నారు. ప్రజలతో ఈ కార్యక్రమంలో మమేకం కావడం సంతోషకరం అన్నారు. విద్యార్థులు జీ20 కూటమి లక్ష్యాలను తెలుసుకోవాలన్నారు. సిరిసిల్లకు చెందిన హరి ప్రసాద్ నాకు లేక రాశారని, జీ20కి సంబంధించి నాకు మంచి సూచనలు చేశారన్నారు.  మన్ కీ బాత్ ణ కార్యక్రమంలో ప్రధాని చేతిలో సిరిసిల్ల చేనేత వస్త్రం తళుక్కున మెరిసింది. చేనేత కార్మికుడు హరి ప్రసాద్ జీ-20 పేరుతో చేతితో స్వయంగా నేసిన వస్త్రాన్ని నరేంద్ర మోదీ చూపించారు. చేనేత కార్మికుల గొప్పదనాన్ని, కళా నైపుణ్యాన్ని వివరిస్తూ ప్రధాని అభినందించారు.

Related Posts

Latest News Updates