ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి ఎంపికయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైయస్ జగన్ ప్రత్యేక సీఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి రాష్ట్రానికి కూడా సీఎస్ కాబోతున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా ప్రస్తుత ప్రభుత్వ చీఫ్ తీవ్ర అనారోగ్యంతో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఆయన పదవీకాలం కూడా త్వరలో ముగియనుండడంతో ఏపీ కొత్త  సీఎస్ నియామకంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలోనే జవహర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త సిఎస్ గా నియామకం చేసేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Related Posts

Latest News Updates