కేజ్రీవాల్ ను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర : మనీశ్ సిసోడియా

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా బీజేపీపై  సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  ఢిల్లీ  ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. గుజరాత్‌ అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటమి భయంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు బీజేపీ కుట్రపన్నుతోంది. ఈ కుట్రలో బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ ప్రమేయముంది. కేజ్రీవాల్‌పై దాడి చేయాలని తమ గూండాలను ఆయన బహిరంగంగానే పురిగొల్పుతున్నారు. ఈ చౌకబారు రాజకీయాలకు మా పార్టీ(ఆప్‌) భయపడబోదు. బీజేపీ గూండాయిజానికి  ప్రజలు తగిన బుద్ధి చెబుతారు అని స్పష్టం చేశారు.

Related Posts

Latest News Updates