సూపర్ స్టార్ కృష్ణ మెమోరియల్ను ఏర్పాటుచేయాలని ఘట్టమనేని కుటుంబం నిర్ణయించిందని తెలుస్తోంది. మహేష్ బాబు కోరిక మేరకు ఈ మెమోరియల్ను ఏర్పాటుచేయడానికి సిద్ధపడుతున్నారని సమాచారం. హైదరాబాద్లో ఏర్పాటుచేయనున్న ఈ మెమోరియల్లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు.. ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన గుర్తులు, ఫొటోలు, అవార్డులతో ఈ స్మారకం ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఏ హీరోకు ఇలాంటి స్మారకం లేదు. స్వర్గస్థులైన సూపర్ స్టార్ కృష్ణ గుర్తులను పదిలంగా ఉంచుకోవాలని ఆయన కుటుంబం నిర్ణయించుకుంది. దీని కోసం ఆయన పేరు మీద ఒక స్మారకాన్ని నిర్మించాలని మహేష్ బాబు, ఆయన కుటుంబం నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ స్మారకంలో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు.. ఆయనకు సంబంధించిన గుర్తులన్నింటినీ పొందుపరుస్తారట. కృష్ణ నటించిన 350కి పైగా సినిమాలకు సంబంధించిన ఫొటోలు, అవార్డులను ఈ మెమోరియల్లో ఉంచుతారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ మెమోరియల్ను సందర్శించే ప్రజలు కాసేపు అక్కడే గడిపి.. సూపర్ స్టార్ కృష్ణ గురించి పూర్తిగా తెలుసుకునే విధంగా ఈ మెమోరియల్ ఉండనుందని అంటున్నారు. పద్మాలయ స్టూడియో వద్ద ఈ మెమోరియల్ను నిర్మించాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా హీరోకి ఇలాంటి మెమోరియల్ లేదు. హుస్సేన్ సాగర్ ఒడ్డున నందమూరి తారక రామారావు మెమోరియల్ ఉన్నప్పటికీ.. అందులో ఆయన సమాధి మాత్రమే ఉంది. కానీ, కృష్ణ మెమోరియల్ను మాత్రం భవిష్యత్తు తరాలు కూడా చూసేలా, ఆయన గురించి తెలుసుకునేలా నిర్మించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. నిజానికి ఈ స్మారక మందిరం నిర్మాణం అనేది గొప్ప విషయం. ఒక దిగ్గజ నటుడికి ఇలాంటి స్మారకం ఒక గౌరవం. కృష్ణ మెమోరియల్ను నిర్మిస్తే ఆయన అభిమానులు సైతం ఎంతో ఆనందిస్తారు. కాబట్టి కచ్చితంగా మహేష్ బాబు ఈ మెమోరియల్ను నిర్మిస్తారనే అంతా భావిస్తున్నారు.తెలుగు సినీ పరిశ్రమకు సుమారు ఐదు దశాబ్దాల పాటు సేవలు అందించి, మకుఠం లేని మహారాజుగా ఎదిగిన సూపర్ స్టార్ కృష్ణ.. ఈనెల 15న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటులో హాస్పిటల్లో చేరిన నటశేఖరుడు.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు నిన్న జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ముగిశాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియల్లో సినీ ప్రముఖులతో పాటు కృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.












