ఎట్టకేలకు అలీకి పోస్ట్… ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారుగా అలీ..

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత అలీకి ఎట్టకేలకు వైసీపీ నామినేట్ పోస్ట్ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం ఆయన్ను రాజ్యసభకు పంపనున్నారని, అందుకే సీఎం జగన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారని బాగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈ విషయంపై పార్టీ గానీ, అలీ గానీ ఏమీ మాట్లాడనేలేదు. తాజాగా… ఏపీ ప్రభుత్వం ఆయన్ను ప్రభుత్వ సలహాదారుగా (ఎలక్ట్రానిక్ మీడియా) నియమించింది. ఈ పదవిలో ఆయన 2 సంవత్సరాలు కొనసాగుతారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక.. జీత భత్యాలు, అలవెన్సులకు సంబంధించి విడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని జీవోలో పేర్కొంది.

 

Related Posts

Latest News Updates