మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో 500 రోజుల్లో అభివృద్ధి చేస్తానని ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా రూ.625 కోట్లతో పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేశానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదన్నారు. మునుగోడు క్యాంపు ఆఫీసులో స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకట స్వామి, ఎమ్మెల్యే ఈటల, ఎంపీ ధర్మపురి అర్వింద్ మేనిఫెస్టోను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ ఫండ్స్తో నియోజకవర్గ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ రూపొందించామని కోమటిరెడ్డి ప్రకటించారు.
తాము మునుగోడులో గెలిస్తే… 200 కోట్లతో రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. అలాగే చేనేత కార్మికుల ఉపాధి కోసం కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూ.100 కోట్ల పె ట్టుబడితో నారాయణపూర్ మండల కేంద్రంలో టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఫ్లోరైడ్ బాధితుల కోసం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో మునుగోడులో రూ.100 కోట్ల తో వంద పడకలతో రీసెర్స్ సెంటర్ కమ్హాస్పిటల్ నిర్మిస్తామని తెలిపారు.
కేంద్రం ద్వారా రూ.25 కోట్లతో చౌటప్పుల్ పట్టణంలో ఆధునిక హంగులతో ఐటీఐ ఏర్పాటు చేస్తామని, మర్రిగూడలో కేంద్ర విద్యాశాఖ ద్వారా నవోదయ పాఠశాల నిర్మిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వీటితో పాటు సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద రూ.100 కోట్లతో చౌటుప్పల్ మండలంలో మూసీనదిపై ఎత్తిపోతల స్కీం ఏర్పాటు, మునుగోడు నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉపాధి క ల్పించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం దేశ వ్యాప్తంగా వివిధ ప్రైవేటు రంగ కంపెనీల యాజమాన్యాలతో చర్చలు జరిపి..నారాయణపూర్, చౌటుప్పుల్, చండూరు మండల కేంద్రాలలో వంద రోజుల్లో మెగా ఉద్యోగ మేళాల నిర్వహిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు.







