శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత.. డిసెంబర్ 30 న తిరిగి తెరుచుకోనున్న ఆలయం

కేరళ ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయాన్ని ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు అధికారులు మూసివేయనున్నారు. నవంబర్ 17న ప్రారంభమైన మండల పూజలు ఇవాళ్టితో ముగియనున్నాయి. అయ్యప్ప స్వామి వారికి మంగళవారం పూజలు నిర్వహించి ఆలయాన్ని మూసివేయనున్నారు. డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు మకరవిళక్కు పర్వదినం రోజున ఆయ్యప్ప ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. మకర సంక్రాంతి రోజున భక్తులు జ్యోతి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత జనవరి 20న మరోసారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ ఏడాది కరోనా ఆంక్షలు సడలించటంతో ఎప్పుడు లేనంతగా భక్తులు పోటెత్తారు. దీంతో 39 రోజుల్లోనే ఏకంగా 223 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి వచ్చిన ఆదాయంలో మూడోంతులు ఉత్సవాల నిర్వహణకే వినియోగిస్తామని ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు తెలిపింది.

Related Posts

Latest News Updates