ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంతలంను రూపొందిస్తున్నారు గుణ శేఖర్. శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
3D టెక్నాలజీతో విజువల్ వండర్గా తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీ ప్రమోషన్స్ను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు దిల్రాజు, గుణ శేఖర్ అండ్ టీమ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ పాన్ ఇండియా రేంజ్లో భారీ ఎత్తున ఈ సినిమాను ప్రమోట్ చేయటానికి భారీ ప్లాన్ను సిద్ధం చేశారు. రీసెంట్గా సమంత, గుణ శేఖర్, దిల్ రాజు సహా టీమ్ సభ్యులందరూ శాకుంతలం ఫస్ట్ కాపీని చూసి హ్యాపీగా ఫీలయ్యారు. ఈ సందర్బంగా …
నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ ‘‘సినిమా అంటే ప్యాషన్ ఉండే ఇద్దరు వ్యక్తులు దిల్ రాజు, గుణ శేఖర్ కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుందో అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా శాకుంతలం. అన్కాంప్రమైజ్డ్గా నిర్మించాం. మన సినిమా రేంజ్ను మరో లెవల్కు తీసుకెళ్లేలా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.













