హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) దవాఖాన విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులను మంజూ రు చేసింది. నిమ్స్ విస్తరణకు రూ.1,571 కోట్లతో రూపొందించిన డీపీఆర్కు ఆమోదం తెలుపుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న నిమ్స్ దవాఖానకు రోగుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో దానిని విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 1800 పడకలున్నాయి. అదనంగా మరో 2 వేల పడకలు వచ్చి చేరనున్నాయి. ఇందులో 500 వరకు ఐసీయూ బెడ్స్ కాగా… మరో 42 విభాగాలను ఏర్పాటు చేయనున్నాయి. ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు నిమ్స్ డైరెక్టర్కు అనుమతి ఇచ్చింది.నిమ్స్ విస్తరణ పనుల బాధ్యతను ఆర్అండ్బీ శాఖకు అప్పగించింది.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తున్నది. ప్రజా వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నది. నిమ్స్ విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలుపడం సంతోషదాయకం. తెలంగాణ వైద్య రంగంలో ఇది మరో పెద్ద ముందడుగు. అంటూ వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.