ఖమ్మం జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన నేతలను ఆహ్వానించడానికి స్థానిక కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. దీంతో పక్కనే వంటల కోసం ఏర్పాటు చేసిన గుడిసెలో వున్న సిలిండర్ పై నిప్పు రవ్వలు పడ్డాయి.

దీంతో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఒకరు మృతి చెందగా..10 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా వుందని, గాయపడ్డ వారిలో ఇద్దరు పోలీసులు, మరో ఇద్దరు పాత్రికేయులు కూడా వున్నారు. క్షతగాత్రులను పోలీసుల వాహనాల్లో ఖమ్మం తరలించారు. ఈ ఘటన జరగడంతో ఆత్మీయ సమ్మేళనం రద్దైంది. నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.