మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీల కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా ఇవాళ గ్రాండ్గా రిలీజ్ అయ్యింది. ఇందులో చిరు సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా, మాస్ మాహారాజా రవితేజ కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా మెగా అభిమానులు థియేటర్ల దగ్గర తెగ సందడి చేస్తున్నారు. ఇక… చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంథ్య థియేటర్ లో అభిమానులతో కలిసి మూవీని చూశారు. డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, చిరంజీవి కూతుర్లు, మనవరాళ్లు, డైరెక్టర్ మెహర్ రమేష్ వాల్తేర్ వీరయ్య మొదటి షోను చూశారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే సంధ్య థియేటర్ కు చేరుకున్న వీరందరూ.. అభిమానుల మధ్య మూవీని చూసి ఎంజాయ్ చేశారు.












